Monday, May 20, 2024

జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

spot_img

జమ్మూకశ్మీర్ లోని కుల్గం జిల్లాలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇవాళ(మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తో భారత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతం సమీపంలోకి భద్రతా బలగాలు చేరుకోగానే టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అలర్టైన భారత భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల మృతి చెందారు.

అనంత్ నాగ్ -రాజౌరి లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. మంగళవారం ఎన్ కౌంటర్ జరిగిన కుల్గం జిల్లా అనంత్ నాగ్ -రాజౌరీ నియోజకవర్గం పరిధిలోనిదే. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి:కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగింపు

Latest News

More Articles