Friday, May 3, 2024

వివేకా హత్యకేసు..దస్తగిరికి బెయిల్..!!

spot_img

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి అట్రాసిటీ దాడి కేసులో కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేసేందుకు దస్తగిరి యత్నించినట్లు బాధితులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దస్తగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో రెండు వారాల క్రితం దస్తగిరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసు నుంచి బయటకు రాకముందే వేముల పోలీసులు దాడి కేసు నమోదు చేసి పీటీ వారెంట్ కింద మరోసారి అరెస్టుచేశారు. దీంతో ఆయన మళ్లీ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దాదాపు 100రోజులుగా కారాగారంలోనే ఉన్నాడు దస్తగిరి. ఈ కేసుకు సంబంధించి దస్తగిరి బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా సోమవారం కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: అనుమానస్పద స్థితిలో ఐదోతరగతి విద్యార్థిని మృతి..!!

Latest News

More Articles