ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ప్రారంభం కానుంది. గత ఏడాది ఫైనలిస్టులైన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో టోర్నీ మొదటి మ్యాచ్ జరుగనుంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం.. రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వారియర్స్ జట్ల మధ్య ఫిబ్రవరి 24న జరుగనుంది. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి.
Read Also: కార్పొరేటర్లు మనసు మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవు
తొలి సీజన్లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్లో మాత్రం రెండు నగరాలలో జరగనుంది. డబ్ల్యూపీఎల్ 2024లో బెంగళూరు, ఢిల్లీ వేదికగా 22 మ్యాచ్లు జరగునున్నాయి. బెంగళూరులో టోర్ని మార్చి 4 వరకు కొనసాగనుంది, ఆ తర్వాత టోర్నీ ఢిల్లీకి మారనుంది. రెండవ సీజన్లో మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. మొత్తంగా ఈ మ్యాచులు 24 రోజుల పాటు జరగనున్నాయి.