విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. జైస్వాల్ సెంచరీ చేసిన సమయానికి భారత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా దిగారు. టెస్టుల్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ కు ఇది రెండో సెంచరీ. జైస్వాల్ ఓ సిక్స్ తో సెంచరీ పూర్తి చేసుకోవడం హైలైట్ గా నిలిచింది.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 58 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు. సెంచరీ హీరో జైస్వాల్ 119 పరుగులతోనూ, కొత్త బ్యాట్స్ మన్ రజత్ పాటిదార్ 13 పరుగులతోనూ ఆడుతున్నారు. జైస్వాల్ స్కోరులో 13 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 14, శుభ్ మాన్ గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ 1, టామ్ హార్ట్ లే 1, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలి