Tuesday, May 7, 2024

ధోనితో జరిగిన ఆ సంఘటన గురించి చెప్తూ పంత్ కన్నీళ్లు

spot_img

భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనితో తనకున్న లోతైన అనుబంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. పంత్, ధోనీ మధ్య తిరుగులేని బంధం ఉంటుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇద్దరూ తమ సాన్నిహిత్యాన్ని కాపాడుకున్నారు. పంత్ మాజీ కెప్టెన్‌తో తన సంబంధాన్ని ప్రేమగా మాట్లాడుతూ.. ధోనితో నా అనుబంధం మాటల్లో చెప్పలేనిది అని అన్నాడు.

“ఎంఎస్. ధోనీతో నా సంబంధాన్ని వివరించడం నాకు ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. మీరు ఎవరితో స్వేచ్ఛగా మాట్లాడగలరు. నేను ఎంఎస్‌డితో ప్రతిదీ చర్చిస్తాను. నేను అతని నుండి చాలా నేర్చుకున్నాను. ఎవ్వరు చర్చించలేని విషయాలను అతనితో చర్చిస్తాను. ” అని స్టార్ స్పోర్ట్స్ ‘బిలీవ్’ సిరీస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ అన్నారు.

వికెట్ కీపర్‌గా పంత్ ని గ్రేట్ MS ధోనీతో పోలుస్తూ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి మాట్లాడాడు.“మొదట, ధోనితో తనని పోల్చటం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను అప్పుడే జట్టులోకి వచ్చాను. అంతలోనే అందరు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుతున్నారు. ధోనితో తనకి పోలికేంటో.. ఎందుకు పోల్చుతున్నారు? అస్సలు పోలికే ఉండకూడదు. కొందరు ఐదు మ్యాచ్‌లు ఆడారు మరియు ఇతరులు 500 ఆడారు. ఆ టైంలో నేను నిజంగా చాలా బాధపడ్డాను. నేను నా గదికి తిరిగి వెళ్ళి ఏడ్చేవాడిని” అని అన్నారు పంత్.

Latest News

More Articles