Friday, May 17, 2024

వాటర్ ట్యాంక్ గుద్దితే బస్సు కిందపడి, యువతి అక్కడికక్కడే మృతి

spot_img

హైదరాబాద్‎లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి బస్సు కిందపడి ఘటనాస్థలంలోనే మృతిచెందింది. కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన యువతి పిట్టల సునీత (26) డాటర్ ఆఫ్ వెంకటస్వామి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్‎లో నివాసముంటోంది. ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం రోజూ మాదిరిగానే స్కూటీపై విధులకు బయలుదేరింది. అయితే సునీత బైకును భరత్ నగర్ ఫ్లైఓవర్ మీద వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది. దాంతో సునీత పక్కనుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద పడింది. సునీత పైనుంచి బస్సు వెళ్లడంతో.. తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయింది. వాహనదారుల సమాచారంతో ప్రమాదస్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Read Also: పొలానికి నీళ్లు పెడుతుండగా కరెంట్ షాక్‎తో తండ్రీకొడుకులు మృతి

Latest News

More Articles