Thursday, May 2, 2024

పొలానికి నీళ్లు పెడుతుండగా కరెంట్ షాక్‎తో తండ్రీకొడుకులు మృతి

spot_img

సంక్రాంతి పండుగ సంబరాలు ముగియకముందే ఏపీలో విషాద ఘటన జరిగింది. పొలానికి నీళ్లు పెడుతుండగా కరెంట్ షాక్‎తో తండ్రీకొడుకులు మృతిచెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నార్పల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బైపిరెడ్డి (36), కొడుకు రాజారెడ్డి (17)తో కలిసి పొలానికి నీళ్లు పెట్టడానికి గురువారం ఉదయం పొలం దగ్గరకు వెళ్లాడు. వారి పొలం పక్కనే ఉన్న హెచ్ఎల్‎సీ కెనాల్ నుంచి నీళ్లు పెట్టడానికి ప్రయత్నించారు. అయితే కాలువలో ఉన్న మోటార్ కు చిలుము పట్టడంతో దాన్ని తొలగిస్తుండగా బైపిరెడ్డి షాక్ కు గురయ్యాడు. తండ్రిని కాపాడబోయి కొడుకు రాజారెడ్డి కూడా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకుల మృతితో అటు కుటుంబంతో పాటు ఇటు గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.

Read Also: ధోని రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

Latest News

More Articles