Friday, May 3, 2024

 29న ఘనంగా దీక్షా దివస్‌

spot_img

హైదరాబాద్‌: ఎన్నటికైనా తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్‌ఎస్‌ మాత్రమేనని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

50 ఏండ్ల కాంగ్రెస్‌ అరాచకాలు, మోసాలను గుర్తు చేసుకుంటూ 29న ‘దీక్షా దివస్‌’ను దేశ, విదేశాల్లో, తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని శ్రేణులు, ఉద్యోగ సంఘాలు, సకలజనులకు పిలుపునిచ్చారు. నవంబర్‌ 29.. దేశ రాజకీయాల్లో అద్భుతమైన ఘట్టానికి బీజంపడిన రోజు అని చెప్పారు. ఒక లక్ష్యం కోసం, ఒక స్పష్టమైన అజెండాతో పార్టీని పెట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ ‘అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర’ అని నినదించినా అది కేసీఆర్‌కే చెల్లిందని పేర్కొన్నారు.

Latest News

More Articles