హైదరాబాద్: ఆదిలాబాద్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానిది ‘డబుల్ ఇంజిన్’ కాదు… ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ లాంటి కార్పోరేట్ల చేతుల్లో ఉందన్నారు.
Also Read.. పుణెలో చిరుత దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి
బీజేపోళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. అమిత్ షా తెలంగాణకు ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతాడు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు కొంచమైన అవగాహన ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా, ఆదిలాబాద్ లో సీసీఐ పునరుద్ధరణపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
Also Read.. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లోకి జెంటిల్మెన్ గేమ్!
రాజకీయ లబ్ధి పొందాలనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు ఇస్తామని, సీసీఐని పునరుద్దరిస్తామని ఏవైనా హమీలు ఇస్తారని తెలంగాణ ప్రజలు ఆశించారని, కానీ రాజకీయ విమర్శలు చేసి పోయాడు తప్ప … ఆయన పర్యటన వల్ల తెలంగాణకు ఒరిగిందేమి లేదని తెలిపారు.