Friday, May 3, 2024

ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ కే తమ సంపూర్ణ మద్దతు: కెఎస్ క్రిష్ణ

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ కే తాము సంపూర్ణ మద్దతు తెలువుతున్నామని జమ్మూకాశ్మీర్ నేషనల్ ప్యాంతర్స్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు – తెలంగాణ ఉద్యమకారుడు సుప్రీం కోర్ట్ న్యాయవాది కెఎస్ క్రిష్ణ తెలిపారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ లోని ప్రతి పౌరుడు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ ని ముచ్చటగా మూడోసారి గెలిపించాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కావాలనా ఆకాంక్షించారు.  కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దేశంలోనే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా 24 గంటల ఉచిత కరెంట్ , మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ , కళ్యాణ లక్ష్మీ లాంటి ఎన్నో పథకాలు బాగున్నాయని తెలిపారు. కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు.

Latest News

More Articles