అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో నక్కదాడిలో 8 మంది గాయపడ్డారు. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవి ప్రాంతం నుంచి వచ్చిన నక్క గ్రామస్థులపై దాడి చేసింది. ఇందులో 8 మందికి గాయాలయ్యాయి.
Also Read.. రిపబ్లిక్ డే మెడల్స్ ప్రకటించిన కేంద్రం హోంశాఖ.. తెలంగాణకు 20 పోలీసు పతకాలు
అనంతరం నక్కను గ్రామస్థులు వెంటపడి కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు,అటవీ అధికారులు గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. నక్క దాడిలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.