కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టి..ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. అంతకుముందు కుమ్రంభీం చౌరస్తాలోని కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
ఆ తర్వాత చిల్డ్రన్ పార్క్ లో కొట్నాక్ భీంరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడుపట్టాలు అందజేశారు.