Thursday, May 2, 2024

జమ్మికుంట బిజిగిర్ షరీఫ్ దర్గా గుట్టపై విషాదం

spot_img

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ దర్గా గుట్టపై ఉన్న కోనేరులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని నుండి దర్గా ఉత్సవాలకు గురువారం వచ్చిన తొమ్మిది మంది స్నేహితులు వచ్చారు. ఉదయం గుట్టపై ఉన్న కోనేరులో స్నానం చేసేందుకు తొమ్మిది మంది యువకులు దిగారు.

ఏడుగురు బయటకు రాగా, కోనేరు ఇద్దరు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సెర్చ ఆపరేషన్ చేపట్టారు. కాగా, అప్పటికి యువకులు మృతి చెందారు. మృతులను శ్రీనాథ్ (19), సాయికుమార్ (24) గుర్తించారు.

Latest News

More Articles