Friday, May 3, 2024

మహబూబాబాద్ జిల్లా రూపు రేఖలు మార్చిన గొప్ప సీఎం కేసీఆర్

spot_img

మహబూబాబాద్ జిల్లా రూపు రేఖలు మార్చిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో 24100 మంది పోడు రైతులకు 67 వేల 730 ఎకరాల పోడు భూమి పట్టాలను అందజేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లాలో 67730 ఎకరాలకు,24 వేల 100మంది రైతులకు ఇవాళ పోడు పట్టాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 4లక్షల 6వేల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు. జిల్లా రూపు రేఖలు మార్చిన గొప్ప సీఎం కేసీఆర్ అని చెప్పారు. భూమిని నమ్ముకొని ఎన్నో గోసలు పడ్డ పోడు రైతులు నేటి పట్టాల పంపిణి తో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రతి పోడు రైతుకి రైతు బీమా,రైతు బంధు,ఉచిత కరెంట్ ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

Latest News

More Articles