సికింద్రాబాద్ పాట్నీ మార్కెట్ లో నకిలీ ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ చేసిన కేసులో పోలీసులు పూర్తి రికవరీ సాధించారు. నలుగురు నిందితులతో పాటు 715 గ్రాముల బంగారం బిస్కెట్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ ,మార్కెట్ పోలీస్ టీంలు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గోవా, మహారాష్ట్రలో తలదాచుకున్న సభ్యులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.