Thursday, May 2, 2024

ఆదివారం హైదరాబాద్ లో మటన్ షాపులు బంద్

spot_img

ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు రద్దీ మామూలుగా ఉండదు.. సాధారణంగా ఆదివారం రోజు చాలా ఇళ్లల్లో మాంసం వంటకాల గుమగుమలు కనిపిస్తాయి. సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ మాత్రమే అనేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే.. ఈ ఆదివారం(ఏప్రిల్-21) మాత్రం హైదరాబాద్ వాసులు మాంసాహారం తినడం కుదరదు. ఎందుకంటే.. ఈ నెల 21న సిటీలోని అన్ని కబేళాలతో పాటు మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మహావీర్ జయంతి సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జైనులు జరుపుకునే పండుగలలో మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగ.. ఈ నేపథ్యంలోనే మహావీరుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు రొనాల్డ్ రాస్ తెలిపారు.

ఇది కూడా చదవండి:కనుల పండువగా భద్రాద్రి సీతారాముల కల్యాణం.. తరలివచ్చిన భక్తజనం

Latest News

More Articles