జియో ఫైనాన్సీయల్ సర్వీసెస్ లో 6.66 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తెలిపింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపులో నుంచి జియో ఫైనాన్సీయల్ను సంలీనం చేసి.. ఆగస్ట్ 21న లిస్టింగ్ చేసింది. దీనికి మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1.60 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇవాళ(మంగళవారం) బిఎస్ఇ లో జియో ఫైనాన్సీయల్ సర్వీసెస్ 4.99 శాతం కోల్పోయి రూ.239.20 దగ్గర ముగిసింది.