ముంబై : ‘‘ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్పై బాంబు దాడి చేస్తాం. వెంటనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలి.’’ అని హెచ్చరిస్తూ ఆర్బీఐకి సోమవారం బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ మేరకు ముంబై పోలీసులు వెల్లడించారు.
ముంబైలోని 11 ప్రదేశాల్లో 11 బాంబు దాడులు జరుగుతాయని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బెదిరింపు మెయిల్ వచ్చిందన్నారు. మెయిల్లో పేర్కొన్న ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేయగా.. అక్కడ ఎలాంటి అనుమానిత పదార్ధాలను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్ ఖిలాఫత్.ఇండియా@జీమెయిల్.కాం అనే ఐడీ నుంచి వచ్చిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.