Friday, May 3, 2024

సెక్యూరిటీ గార్డును కొట్టి చంపిన దొంగలు

spot_img

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చిన దొంగలు.. అక్కడున్న సెక్యూరిటీ గార్డును కొట్టి చంపారు. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లిలో మంగళవారం జరిగింది. ఆరంఘర్ చౌరస్తాలోని ఓ పరిశ్రమలో ఆసిఫ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి కొంతమంది దొంగలు దొంగతనం చెయ్యడానికి వచ్చి.. సెక్యూరిటీ గార్డు ఆసిఫ్ పై దాడి చేశారు. గార్డును విచక్షణారహితంగా కొట్టడ్డంతో స్పాట్‎లోనే చనిపోయాడు. అక్కడి నుంచి 6 సీసీ కెమెరాలు, విలువైన ఐరన్ రాడ్స్ దొంగలించారు. సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురి కావడంతో కంపెనీ యజమాని భయంతో వణికిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగిన ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest News

More Articles