Sunday, April 28, 2024

ఈస్టర్ వేడుక​లో..లోయలో పడిన బస్సు..45మంది భక్తులు మృతి.!

spot_img

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సులో పడటంతో 45 మంది మృతిచెందారు. ఈ ఘటనలో ఒక బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అక్కడి అదికారులు తెలిపారు. ఈ ప్రమాదం పై సమాచాం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఈస్టర్ పండుగ జరుగుతుంది. అక్కడ జరిగే వేడుకకు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో మొతకతం 46 మందితో వెళ్తున్న బస్సు బోట్స్ వానా నుంచి మోరియాకు వెళ్తుంది.

దక్షిణాఫ్రికాలోని లిపోపో రాష్ట్రంలో కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు దగ్గర అదుపు తప్పడంతో బస్సు 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. వెంటనే బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చరర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణ సంస్ధ పేర్కొంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ..!

Latest News

More Articles