Friday, May 17, 2024

21 కేజీల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ స్టూడెంట్స్

spot_img

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వినాయకుడి మండపంలో చూడముచ్చటగా అలంకరణ చేశారు. అందరూ భక్తితో గణనాథుడికి పూజలు చేస్తుంటే.. కొందరు మాత్రం ఆ విఘ్న నాయకుడి ప్రసాదానికి కన్నం వేస్తున్నారు.

Read Also: తిరుమలలో శ్రీవారి ఉచిత బస్సు చోరీ

తాజాగా చార్మినార్‎ ఏరియాలోని ఓ గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. దాదాపు 21 కిలోల లడ్డూను పట్టపగలే ఎత్తుకెళ్లారు. అయితే ఈ దొంగతనానికి పాల్పడింది.. చిల్లర దొంగలు కాదు.. అలా అని పేరు మోసిన గజ దొంగలూ కాదు. స్కూలుకెళ్లే పిల్లలు ఈ లడ్డూను ఎత్తుకెళ్లడమే ఇక్కడ అసలు ట్టిస్ట్. ఘన్సీబజార్ గణేష్‌ మండపంలో 21 కిలోల లడ్డూను కొందరు స్కూల్‌ విద్యార్థులు ఎత్తుకెళ్లారు. స్కూల్‌ నుంచి వెళ్తున్న విద్యార్థులు గణేష్ మండపం వద్ద తచ్చాడుతూ కనిపించడం సీసీ కెమెరాలో రికార్డయింది. కాసేపటికి వారు మండపంలోకి చొరబడి లడ్డూ కవర్‎ను తీసుకెళ్లి పూర్తిగా తినేశారు. ఈ విషయాన్ని గణేష్ మండపం నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

More News..

Latest News

More Articles