హైదరాబాద్: అసెంబ్లీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వాహనదారుడు మృతి చెందాడు. సైఫాబాద్ నుంచి నాంపల్లి వైపు వెళ్తుండుగా… నిజాం క్లబ్ గేటు ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read.. పబ్జీకి బానిసై సూసైడ్ చేసుకున్న డిగ్రీ విద్యార్థి
మృతుడిని రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన శ్రీరాములుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.