Friday, May 3, 2024

ఈటలపై గరం.. బీజేపీ లీడర్ల రహస్య భేటీ!!

spot_img

హైదరాబాద్:  హైదరాబాద్ లో బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవ్వడం కలకలం రేపుతోంది. ఈటల తీరుపై గుర్రుగా ఉన్న మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, విజయ శాంతి,  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు,  మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈటల వ్యవహార శైలిపైన చర్చించినట్టు సమాచారం.

వైద్య చరిత్రలోనే అరుదైన కేసు.. కడుపులో బిడ్డకు డెంగ్యూ

అమిత్ షా రెండు రోజుల టూర్ లో కొంతమంది నేతలతోనే డిస్కషన్ చేయడంపై అసంతృప్తిగా ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన అమిత్ షా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెలకు మాత్రమే సమయం ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని , జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ ని పిలవడం వరకు ఓకే.. కానీ ఈటెల కు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు  అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read.. ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు లేదు

నియోజకవర్గాల్లో చేరికల విషయంలో సీనియర్లను సంప్రదించక పోవడంపై ఈటలపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల ములుగు నుండి మాజీ మంత్రి చందూలాల్ కొడుకు చేరడం.. సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరికలపై ఆగ్రహంతో ఉన్న నేతలు, తమను కనీసం సంప్రదించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు..

అర గంట పాటు వేల కోట్లకు అధిపతిగా క్యాబ్ డ్రైవర్

Latest News

More Articles