హైదరాబాద్ : జనవరి 31తో రాయితీ పెండింగ్ చలాన్ల గడువు ముగియనుంది. అయితే, ఈ గడువును మరోసారి పొడిగించేది లేదని పోలీసు శాఖ గతంలో స్పష్టం చేసింది. తొలుత గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 15 రోజులు అవకాశం కల్పించారు. అయితే, టెక్నికల్ సమస్యల కారణంగా తుది గడువును జనవరి 31 వరకు పొడిగించారు. పెండింగ్ చలాన్లపై టూ వీలర్లు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో వీటి చెల్లింపులకు ప్రజల మంచి స్పందన వచ్చింది.
Also Read.. ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్: భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కంటిన్యూ..!!