Friday, May 3, 2024

టాలీవుడ్​లో మరో విషాదం..ప్రముఖ రచయిత కన్నుమూత.!

spot_img

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు, స్టార్ రైటర్ శ్రీరామ క్రుష్ణ కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఈయన మరణం పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన రామక్రుష్ణ చాలా మంది సీనియర్ నటులను వెండి తెరకు పరిచయం చేశారు. తెనాలీలో పుట్టిన ఆయన చెన్నైలో స్థిరపడ్డారు.

అటు తమిళంలోనూ..ఇటు తెలుగులోనూ రాణించారు. బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్ మెన్, చంద్రముఖి వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కు మాటలను అందించారు. ఎక్కువగా శంకర్, మణిరత్నం గార్లతో వర్క్ చేశారు. ఈయన డైలాగ్స్ ఇచ్చారంటే సినిమా హిట్ అవ్వాల్సిందే అనేంత రేంజీలో డైలాగ్స్ రాసేవారు. కొన్నేళ్లుగా చాలా తక్కువ ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకున్న రామక్రుష్ణ చివరిగా రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీకి డైలాగ్స్ రాశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం వల్లే ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారని సమాచారం.

ఇది కూడాచదవండి: వేసవిలో పుచ్చకాయ తింటే ఎంత మంచిదో తెలుసా?

Latest News

More Articles