సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిల్చున్న ముగ్గురు వ్యక్తులను గుర్తుతెలియని వాహనం అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపక్కనే కారు ఆపి నిల్చున్న సమయంలో అటువైపుగా వచ్చిన గుర్తు తెలియనివాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా మ్రుతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: గుజరాత్ పై 9 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం