జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడు ఆర్ఎస్ శివాజి కన్నుమూశారు. తమిళంలో ఆయనకు 100కు పైగా చిత్రాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివాజి.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు. ఆర్ఎస్ శివా మృతి పట్ల పలువురు కోలివుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : దీప్తి హత్యకేసును చేధించిన పోలీసులు..చెల్లే హంతకురాలు
40 ఏళ్ల కిందట తమిళంలో వచ్చిన పన్నీర్ పుష్పంగల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. అపూర్వ సగోదరార్గల్, మైకేల్ మదన కామరాజు, కొలమావు కొకిల, సూరరై పోట్రు, గార్గీ వంటి సినిమాలు శివాజికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోకి సుందరిలో మాలోకం అనే కానిస్టేబుల్ పాత్రలో శివాజి తన నటనతో అందరిని నవ్వించాడు.