Thursday, May 2, 2024

టాటా గ్రూప్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

spot_img

రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల  ఏర్పాటుకు టాటా కంపెనీ, ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఇవాళ(శనివారం) సెక్రటేరియట్ లో టాటా టెక్నాలజీస్ ​ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ అప్ గ్రేడ్ చేయనుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణను టాటా టెక్నాలజీస్ అందించనుంది. 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీ తో జత కట్టడం ఖాయం

Latest News

More Articles