Saturday, May 4, 2024

ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తి

spot_img

ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. హుస్సెన్ సాగర్ లో జరుగుతున్న ఈ నిమజ్జనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యక్షంగా వీక్షించారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయత్ర మొదలయింది. మధ్యాహ్నం 1.30 గంటలకు గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తుల కోసం అటు పోలీసులు, ఇటు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి భారీ ఏర్పాట్లు చేశారు.

Read Also: రికార్డు ధర పలకిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన

ప్రతి ఏడాది గణేష్ నిమజ్జనం సాయంత్రం వరకు కొనసాగేది. కానీ, ఈ సారి ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యల వల్ల నిమజ్జనం మధ్యాహ్నం కల్లా పూర్తయింది.

Read Also: హైదరాబాద్‎లో రూ.1.26 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

Latest News

More Articles