Thursday, May 2, 2024

మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది

spot_img

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా తీవ్రంగా విమర్శించారు. అన్నివర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ అగ్ర నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తా పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇచ్చింది. కానీ బీఆర్ ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తమ ఖాతాలో వేసుకుంది. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దీనిపై యూటర్న్ తీసుకోవడంతో పాటు టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు పెంచింది. గతంలో బల్మూరి వెంకట్‌ లాంటి నాయకులు కోర్టులో కేసులు వేసి పలు పోటీ పరీక్షల రద్దుకు కారణమయ్యారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అందుకున్నారు. ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని అన్ని న్యూస్ పేపర్ల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. ఇప్పడు..కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన ఆ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: సంతానం లేని వారికి గరుడ ప్రసాదం.. 30 కి.మీ వరకు నిలిచిపోయిన వాహనాలు

 

 

Latest News

More Articles