Friday, May 3, 2024

హైదరాబాద్‌‎లో మెట్రోరైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

spot_img

హైదరాబాద్‌‎లో విషాద ఘటన జరిగింది. మూసాపేట మెట్రో స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి 9.16 గంటల సమయంలో మెట్రో రైలు వస్తుండగా.. దాని ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టికెట్‌ తీసుకోకుండా స్టేషన్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. ప్లాట్ ఫాం 2 మీదకు చేరుకుని రైలు రాగానే దూకాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మూసాపేట్ స్టేషన్ కంట్రోలర్ పులెందర్ రెడ్డి కూకట్‎పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Latest News

More Articles