జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు నిన్న(గురువారం) ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయమూర్తి.. జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. జైలులో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజువారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని నగలు ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లను న్యాయస్థానం కల్పించింది. కవితను తీహార్ జైలుకు తరలించే ముందే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తీహార్ జైలు అధికారులకు అందించామని, అయినా కవితకు జైలులో ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆమె తరపు న్యాయవాది మోహిత్రావు కోర్టు దష్టికి తీసుకెళ్లారు. కనీసం రోజువారీ ఉపయోగించే దుస్తులకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ ఫిర్యాదును రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా పరిశీలించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడంలేదో ఇవాళ(శుక్రవారం) సమాధానం చెప్పాలని జైలు అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో అసమ్మతి సెగ.. వివేక్ కుటుంబానికేనా అన్ని అవకాశాలు