Sunday, April 28, 2024

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాగూర్‌.!

spot_img

‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్యే నాన్న మూవీలో కూడా నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది ఈ అమ్మడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ క్రమంలో మృణాల్‌ ఠాకూర్‌ హైదరాబాద్ లోని బల్కంపేట ఎలమ్మ అమ్మవారిని దర్శించుకుంది. అనంతరం ప్రత్యేక పూజలు చేసింది.

ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఏదైనా కొత్త పని, పెద్ద పనులు ప్రారంభించే ముందు పూజలు చేయమని, వీలైతే గుడికి వెళ్లమని తన పేరేంట్స్ చెప్పారని..అందుకే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ కు ముందు బల్కంపేట అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపింది. కాగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో కనిపించగా..ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. తాజాగా మరోసారి ఫ్యామిలీ స్టార్ తో తన అద్రుష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాడు.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

ఇది కూడా చదవండి: తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు వార్నింగ్.!

Latest News

More Articles