Friday, May 3, 2024

ఎన్నికల వేళ కాషాయంలోకి దూరదర్శన్ లోగో.. విపక్షాల ఆగ్రహం

spot_img

ఎన్నికల వేళ ప్రభుత్వ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదమైంది. డీడీ న్యూస్ లోగోను ఎరుపు నుంచి కాషాయరంగులోకి మార్చింది. ఈ నెల 16 నుంచే మారిన లోగో చానల్‌లో కనిపిస్తోంది. లోగో రంగు మారినప్పటికీ తమ ప్రాధామ్యాల విషయంలో మాత్రం ఎలాంటి  తేడా ఉండదని దూరదర్శన్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని, డీడీ వార్తలను సరికొత్తగా అనుభవించాలని కోరింది.  వేగంపై కచ్చితత్వం, క్లెయిమ్స్ పై వాస్తవాలు, సంచలనాత్మక నిజాలకు సంబంధించిన వార్తల ప్రసారం విషయంలో తమకు ధైర్యం ఉందని చెప్పింది. ఎందుకంటే  డీడీ న్యూస్‌లో ప్రసారమైతే అది నిజమని ఆ పోస్టులో తెలిపింది. అయితే, రంగుమార్పుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కాషాయీకరణ దూరదర్శన్‌కూ మారిందని ఫైర్ అవుతున్నాయి.

దూరదర్శన్ ప్రస్తుతం ఆరు జాతీయ చానళ్లను, 17 ప్రాంతీయ చానళ్లను కలిగి ఉంది. నేషనల్ చానళ్లలో డీడీ నేషనల్, డీడీ ఇండియా, డీడీ కిసాన్, డీడీ స్పోర్ట్స్, డీడీ ఉర్దూ, డీడీ భారతి వంటి జాతీయ చానళ్లు.. డీడీ అరుణ్ ప్రభ, డీడీ బంగ్లా, డీడీ బీహార్, డీడీ చందన, డీడీ గిర్నార్, డీడీ మధ్యప్రదేశ్, డీడీ మలయాళం, డీడీ నార్త్ఈస్ట్, డీడీ ఒడిశా, డీడీ పొదిగై, డీడీ పంజాబ్, డీడీ రాజస్థాన్, డీడీ సహ్యగిరి, డీడీ సప్తగిరి, డీడీ ఉత్తరప్రదేశ్, డీడీ యాదగిరి, డీడీ కషీర్ వంటి ప్రాంతీయ చానళ్లు నిర్వహిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది

Latest News

More Articles