హైదరాబాద్: టాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు తెచ్చుకున్న చైతన్య- సమంత మళ్లీ కలుస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై సామ్ పరోక్షంగా స్పందించింది. తాజాగా సమంత పింక్ శారీ లో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సమంత హాట్ నెస్ కంటే ఆమె కుడివైపు రిబ్స్పై ఉండే టాటూ మాయమవడమే అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది.
గతంలో సమంత చైతన్యతో కలిసి ఉన్నప్పుడు తన కుడివైపు రిబ్స్పై చైతన్య ముద్దుపేరైన చై (Chay)ని పచ్చబొట్టుగా వేయించుకుంది. వీరు విడిపోయిన తర్వాత కూడా ఆ టాటూను సామ్ అలానే ఉంచుకుంది. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఫొటోల్లో కూడా ఆ టాటూ కనిపించింది. అయితే, తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మాత్రం ఆ పచ్చబొట్టు మాయమైపోయింది. ఈ ఒక్క ఫొటోతో రూమర్స్కు సమంత చెక్ పెట్టినట్లైంది. దీంతో ఇక సమంత-చైతన్య కలవడం కలే అని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read.. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్కు నీతా అంబాని హారతి
దాదాపు 10 ఏండ్ల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటైన సామ్-చై జోడి.. నాలుగేళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ సింగిల్ లైఫ్ను లీడ్ చేస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు.