Sunday, April 28, 2024

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను హత్య చేసిన అల్లుడు!

spot_img

సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లోని పద్మారావు కాలనీలో ఇంట్లో శాంతమ్మ (40) అనే మహిళ హత్యకు గురయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారం వాసి అయిన సాయిబాబా (26) తన భార్య సత్యవతి (22)ని సంసారానికి పంపేందుకు అడ్డుపడుతుందనే కోపంతో అత్తను కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డు వచ్చిన భార్య గొంతు కోసి పరారయ్యాడు. అనంతరం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. భార్య గొంతు కోయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు, పోలీసులు చికిత్స కోసం ఆమెను సంగారెడ్డి  ఆసుపత్రికి తరలించారు.

Latest News

More Articles