Thursday, May 2, 2024

మంచిర్యాల జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

spot_img

మిని వాహనం, బైక్ ఢీకొన్న ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగింది. మండలంలోని రేండ్లగూడకు చెందిన దేవి సుదర్శన్(48)తన అన్న కుమారుడైన దేవి రక్షిత్(23) బైక్ పై దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇవాళ( శనివారం) సాయంత్రం స్థానిక పర్యవరణ అధ్యాయన కేంద్రం సమీపాన ప్రధాన రహాదారిపై మిని వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న సుదర్శన్ అక్కడికక్కడే చనిపోగా…రక్షిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సుదర్శన్ కు భార్య రాజేశ్వరితో పాటు ఇద్దరు కుమార్తేలు,ఓ కుమారుడున్నారు. మృత‌దేహాల‌ను శవపరీక్ష నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక అధనపు ఎస్ఐ మృత్యుంజయ సర్కార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఆ లింక్ క్లిక్ చేస్తే రూ. 2 లక్షలు పోయాయి

Latest News

More Articles