ఖమ్మం జిల్లా: తిరుమలాయపాలెం మండలం మాదిరీ పురం సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, తిరుమలాయపాలెం పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక కారులో తరలిస్తున్న 14 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు, ఒడిస్సాకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని వెల్లడించారు.