భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి జరిగింది. భద్రాచలం దగ్గర గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లిన ఓ ముగ్గురు యువకులు నీట మునిగారు. దీంతో అలర్టైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఇద్దరు యువకులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపుడికి చెందిన లకావత్ గణేష్, తేజగా గుర్తించారు.