రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం కనకమామిడిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చోటు చేసుకుంది.
Also Read.. ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన కుటుంబంపై యువకుడు కాల్పులు.. ఇద్దరు మృతి
ప్రమాదం జరిగే సమయంలో ఆడిటోరియంలో 14 మంది కూలీలు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులను బిహార్కు చెందిన బబ్లూ, పశ్చిమ బెంగాల్కు చెందిన సునిల్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.