Friday, May 10, 2024

లింగ‌య్య‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని క‌మ్యూనిస్టుల‌ను కోరిన సీఎం కేసీఆర్

spot_img

న‌కిరేక‌ల్ : నకిరేకల్ నియోజవర్గం బీఆర్ఎస్ అభ్య‌ర్థి చిరుమ‌ర్తి లింగ‌య్య‌కు క‌మ్యూనిస్టు సోద‌రులంతా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరారు. న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ఆయన పాల్గొని ప్ర‌సంగించారు. లింగ‌య్య‌ ప్ర‌జ‌ల్లో ఉండే మ‌నిషి. లింగ‌య్య గెలుపును ఎవ‌డు ఆప‌లేడు. ప్ర‌జా శ‌క్తి ముందు వ్య‌క్తులు ఎవ‌రేం చేయ‌లేరన్నారు.  లింగ‌య్య‌ను గెలిపిస్తే.. ఈ ప్రాంతరంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి దీన్ని అభివృద్ధి చేసే బాధ్య‌త నేను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

‘‘ఇందిర‌మ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగ‌ల రాజ్యం. ఎవ్వ‌ళ్లు ఏం చేసిండ్రు. ఎవ‌రి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్త‌రు. ఎవ్వ‌ళ్లు ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డుతారు అనేది ఆలోచించి మీరు ఓటేసిన‌ట్టే అయితే మీకు లాభం జ‌రుగుత‌ది. ఈ గ‌డ్డ మీద పుట్టిన న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి మ‌హానాయ‌కుడు. ప్రజల సమస్యలపై ఎన్నో పోరాటు చేసిండు. క‌మ్యూనిస్టు సోద‌రులు ఇక్కడ పోటీలో లేరు. కాబట్టి కమ్యూనిస్టు అభిమానులు తమ ఓట్లను ఎవ‌రికో వేసి వృధా చేసుకోవద్దు. ఒక ప్ర‌గ‌తికాముక‌మైన బీఆర్ఎస్ పార్టీకి ద‌య‌చేసి వేయండి. లింగ‌య్య‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నా అని కేసీఆర్ కోరారు.

Latest News

More Articles