రంగారెడ్డి జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా గంజాయి తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ జోన్ ఎస్.ఓ.టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు వివరించారు.
మహారాష్ట్ర కు చెందిన సయ్యద్ ఖాన్ షరీఫ్ ఖాన్ (41), మరొక నిందితుడు మహమ్మద్ అదిల్ అలియాస్ మహమ్మద్ జావిద్ బావని(21) తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుండి శంకరపల్లి మీదుగా మహారాష్ట్ర కు తరలిస్తున్నారు. శంషాబాద్ జోన్ ఎస్ ఓ టి పోలీసులు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిడిఎల్ ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నారు.
ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి 2 కేజీలు కలిగిన 114 ప్యాకెట్లలో 228 కేజీల గంజాయిని, ఒక బొలెరో వాహనాన్ని, మూడు సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన రాజేంద్రనగర్ శంకర్ పల్లి పోలీసులను రాజేంద్రనగర్ జోన్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.