Thursday, May 2, 2024

రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం

spot_img

రంగారెడ్డి: రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం సృష్టించింది. వ్యవసాయ కళాశాల వద్ద ఆగి ఉన్న కారును ఢీకొంటూ దూసుకెళ్లింది. స్పాట్ లో లారీ డ్రైవర్ మృతి చెందగా.. కారు లో ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ధాన్యం లోడ్డుతో వెళుతున్న లారీ కారును ఢీకొని పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా ద్వంసమైంది. లారీ కర్నూల్ జిల్లా నుండి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ కు గుండె పోటు రావడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Latest News

More Articles