మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. చదువుపై దృష్టిపెట్టాలని మందలించిన టీచర్ను ఒక స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏండ్ల రాజు ఠాకూర్ స్థానికంగా ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కత్తితో దాడి చేసిన స్టూడెంట్ (17)గతంలో రాజు ట్యూషన్లో చదివాడు. విద్యార్థినులతో చనువుగా ఉండటంపై ఆగ్రహించి, చదువుపై దృష్టిపెట్టాలని మందలించి ట్యూషన్ నుంచి పంపేశాడు.
దీంతో కక్ష పెంచుకున్న ఆ స్టూడెంట్ టీచర్ రాజు ను కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. టీచర్ పై దాడి చేసి పారిపోయిన స్టూడెంట్ అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
#Video: A minor boy stabbed coaching class owner with a knife in Kashimira, #MiraRoad. The incident was captured on #CCTV camera. The boy later surrendered before the police.#mumbainews #MumbaiCrime #murdercase pic.twitter.com/kfGXUpGGgD
— Free Press Journal (@fpjindia) August 13, 2023