Thursday, May 2, 2024

బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం..44మంది సజీవదహనం..!

spot_img

బంగ్లాదేశ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల రెస్టారెంట్ లో మంటలు చెలరేగడంతో 44 మంది దుర్మరణం చెందారు. మరో 40మందికిపైగా గాయపడ్డారు. అగ్నిప్రమాద సిబ్బంది దాదాపు 75మంది రక్షించారు.గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దేశ రాజధాని ఢాకాలో జరిగింది.

ఢాకా బెయిలీ రోడ్డులోని ఓ బిర్యానీ రెస్టారెంట్ లో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్రదుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి:భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారు..!

Latest News

More Articles