Thursday, May 2, 2024

తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర.. గంగుల సంచలన వ్యాఖ్యలు

spot_img

కాంగ్రెస్, బీజేపీ పార్టీల ముసుగులో ఆంధ్రా నేతలు తెలంగాణలోకి వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న సంపదను దోచుకునేందుకే ఆంధ్రా నేతలు వస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణను కేసీఆర్‌ను ఓడగొట్టి మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపే ప్రయత్నాల్లో భాగంగానే ఆంధ్రా లీడర్లు మొత్తం తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువతను బీఆర్ఎస్ పార్టీలోకి గంగుల కమలాకర్ ఆహ్వానించారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే మా‌ భవిష్యత్తు అని నమ్ముతున్నారని పేర్కొన్నారు.

Latest News

More Articles