Thursday, May 2, 2024

రేవంత్ రెడ్డికి పరిపక్వత లేదు.. తెలంగాణకి కష్టాలు తప్పవు

spot_img

రాజకీయంగా అపరిపక్వత, అనుభవం లేని రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవన్నారు. గురువారం ఆమె సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారికోటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ప్రజాసమస్యల పరిష్కారమంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత సులువు కాదని లక్ష్మీపార్వతి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని, ఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌పై ఆధారపడాల్సి ఉంటుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్హ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆమె అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం సహా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆమె కొనియాడారు.

Latest News

More Articles