Thursday, May 2, 2024

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. తెలంగాణ పోలీసులకి పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

spot_img

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు ఇద్దరు ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. ఈ రోజు ఉదయం బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్నారు SOT బాలానగర్ పోలీసులు. దీంతో పక్కాగా చెకింగ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానంతో AP 39 QH 1763 MARUTHI ECO వాహనాన్ని పట్టుకుని పరిశీలించగా 22 కేజీల గంజాయి, 11 పాకెట్స్ లో లభించింది.

గంజాయి విలువ 8 లక్షలుగా పేర్కొన్నారు పోలీసులు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడ లోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ అని తెలిసింది. వీరు గంజాయి స్మగ్లింగ్ లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో ఈ నేరానికి పాల్పడ్డారు. ఆరోగ్యం బాగాలేదు అని సెలవు పెట్టి మరీ మొదటి సారిగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం జరిగింది. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై విచారణ జరుగుతుంది.

Latest News

More Articles