మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో ఈ మూవీ చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు కీలక అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందుకోసం ఆడిషన్స్ నిర్వహించనున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో నడిచే విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. దాంతో అక్కడి స్థానిక నటుల కోసం వేట మొదలైంది. స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు ఇలా అన్ని ఏజ్ గ్రూప్స్కి చెందినవారు ఆడిషన్స్లో పాల్గొనవచ్చని తెలియజేశారు. కాబట్టి రాంచరణ్ మూవీలో నటించాలనుకునేవారికి ఇదో సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు.
Read Also: వాకర్స్కి హైదరాబాద్ మెట్రో గుడ్న్యూస్.. మెట్రో టికెట్లపై రాయితీ
ఆడిషన్స్లో భాగంగా ఫిబ్రవరి 5 నుండి 17 వరకు వరుసగా విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
#RC16 is coming to Uttarandhra for a talent hunt ❤️🔥
To all the aspiring actors, get ready to be a part of something sensational 💥
Auditions in Vizianagaram, Salur, Srikakulam and Visakhapatnam during the month of February.
Email ID to reach out to in case of any… pic.twitter.com/FBF4K4rFCO
— Mythri Movie Makers (@MythriOfficial) February 1, 2024