జాతీయపార్టీగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో జోష్ పెంచింది. బీఆర్ఎస్ మహారాష్ట్రలో పార్టీ శాశ్వత భవనాన్ని ప్రారంభించబోతున్నది. అందుకోసం నాగపూర్లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 15న ఉదయం నాగపూర్ వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తారు.
నాగపూర్లోనే కాకుండా.. ముంబై, పూణె, ఔరంగాబాద్లోనూ పార్టీ తాత్కాలిక ఆఫీస్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాంతో మంచి భవనాల కోసం వెతుకుతున్నారు. బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో.. ఈ నెల 19న నాందేడ్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.